దాదాపు మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రత.. కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి.. అయినా ఎంతో ధైర్యంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకున్నది 6 ఏండ్ల బాలిక. సముద్రమట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ బేస్ క్యాంప్నకు తల్లితో కలిసి చేరుకున్న బాలిక అరిష్క లద్దా చరిత్ర సృష్టించింది. ఇక్కడికి చేరిన అతిచిన్న భారతీయురాలిగా రికార్డు నమోదు చేసింది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అరిష్క ఈ రికార్డు సృష్టించడానికి 15 రోజులపాటు నడిచింది.
– న్యూఢిల్లీ