మథుర (యూపీ), ఆగస్టు 30: మథురలో మద్యం, మాంసం విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పకడ్బందీగా నిషేధం అమలుకు, మద్యం, మాంసం వ్యాపారులు ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన కృష్ణోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఇప్పటి వరకు మద్యం, మాంసం వ్యాపారం చేసినవారు మథురకు పూర్వవైభవాన్ని తెచ్చేలా పాలు విక్రయించాలని సూచించారు.