Measles Outbreak | గత రెండు దశాబ్దాలుగా భారత్లో మీజిల్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మీజిల్ కేసులు పెరిగాయి. మైహార్ జిల్లాలో మీజిల్స్లో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మంది పిల్లలు మీజిల్స్తో బాధపడుతున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. 2022లో భారత్లో సుమారు 11 లక్షల మంది చిన్నారులకు మీజిల్స్ వ్యాక్సిన్ మొదటి డోసు అందలేదని పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగకపోవడంతో పిల్లల్లో ఇన్ఫెక్షన్కు కారణమైందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
మీజిల్స్ అంటువ్యాధని.. ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపించే ప్రమాదం ఉందని.. ఈ క్రమంలో జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2023 నవంబర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్తో సహా పలు దేశాల్లో మీజిల్స్ ప్రమాదంపై హెచ్చరికలు చేసింది. టీకాలు, విచారణ చర్యలు తీసుకోవడం మీజిల్స్ రేటు గణనీయంగా తగ్గింది. ఆగస్టు 2023 నివేదిక ప్రకారం.. భారత్లో 2017-2021 మధ్య మీజిల్స్ కేసులు 62శాతం వరకు తగ్గాయి. ఆ తర్వాత టీకాలు వేయకపోవడంతో మరోసారి ప్రభావం పెరిగింది. మీజిల్స్ ఓ అంటువ్యాధి. పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన వైరస్తో ఈ వ్యాధి సోకుతుంది. చిన్న పిల్లల్లో తీవ్రమైన కేసుల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. మీజిల్స్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మంపై ఎరుపుగా మారి దద్దుర్లు వస్తాయి. దీని ప్రభావం ముఖం, చెవుల వెనుక భాగంగా ఎక్కు కనిపిస్తింది. శరీరంలోని ఇతర భాగాలకు సైతం వ్యాపిస్తుంది.
ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దద్దుర్లతో పాటు, కొంతమంది పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, కండ్లకలక తదితర సమస్యలు సైతం మీజిల్స్ సోకిన వారిలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రేటు పెరిగినప్పటికీ.. ఏటా రెండు లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు ఇప్పటికీ మీజిల్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వైరస్ సోకిన పది నుంచి 14 రోజుల తర్వాత మీజిల్స్ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరం, పొడిదగ్గు, ముక్కుకారడం, గొంతు నొప్పి, కళ్లల్లో వాపు, బుగ్గల లోపల పొర ఎర్రబడడం తదితర అనేక రకాల సమస్యలు వస్తాయి. దాంతో పిల్లలు ఆహారాన్ని తీసుకోవడంలోనూ ఇబ్బంది ఎదురవుతుంది. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలందరూ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని.. మీజిల్స్ దద్దుర్లు దాదాపు ఏడు రోజుల వరకు ఉంటాయి. టీకాలు వేయని పిల్లలు అంటువ్యాధి తీవ్రమైన రూపాన్ని అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది.
మీజిల్స్ టీకా భవిష్యత్తులో ఈ తీవ్రమైన వ్యాధి, దాంతో కలిగే తీవ్రత నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. చికెన్పాక్స్ (వరిసెల్లా) వ్యాక్సిన్, మీజిల్స్ మంప్స్ రుబెల్లా (MMRV) టీకా సహాయంతో పిల్లలను మీజిల్స్ నుంచి రక్షించవచ్చు. పిల్లలు 12 నుంచి 15 నెలల మధ్య, 4 నుంచి 6 సంవత్సరాల మధ్య బడుల్లో చేరే ముందు ఎంఎంఆర్ టీకాను వేయించాలి. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లో అంతరం మళ్లీ దేశంలో ఈ సంక్రమణ ప్రమాదాన్ని పెంచింది.