MEA | భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన తగ్గించింది. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. విదేశాంగ శాఖ రంగంలోకి దిగి చర్చలు జరిపింది. అయితే, దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి స్పందించారు. మాజీ నేవీ సిబ్బంది శిక్ష తగ్గించారని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా అందలేదని తెలిపారు. మీడియా ఊహాగానాలకు తావివ్వవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారతీయులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే మా అతిపెద్ద ఆందోళన అని బాగ్చి పేర్కొన్నారు. న్యాయబృందం, కుటుంబ సభ్యులతో కలిసి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారి అరిహా కేసుపై సైతం స్పందించారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం కేసు సంబంధించిన అప్డేట్స్ లేవీ లేవన్నారు. భారత జంటకు జర్మనీలో పుట్టిన చిన్నారి బాధ్యతలను ఆ దేశానికే అప్పగిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. చిన్నారిని భారత్కు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు.
బాలిక జాతీయ గుర్తింపు, హక్కులను పరిరక్షించడానికి.. భారత్కు తిరిగి వచ్చేలా చూసేందుకు తాము జర్మన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా (LTe) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను అప్పగించాలని పాక్ను భారత్ కోరినట్లు అరిందమ్ బాగ్చి మీడియాలో సమావేశంలో తెలిపారు. సయీద్పై అభియోగాలను వివరించే నిర్ధిష్ట ప్రతాలతో పాక్కు పంపినట్లు ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. హఫీజ్ సయీద్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే.