లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ప్రతిపాదన.. తదితర అంశాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆదివారం స్పందించారు. అయితే, యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తనను సీఎం చేస్తామని ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని, ఇది ఏమాత్రం నిజం కాదన్నారు. ఇతర పార్టీల గురించి కాకుండా కాంగ్రెస్ తన గురించి మాత్రమే ఆందోళన చెందాలని సెటైర్లు వేశారు.
యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి పిల్లిలా తయారైందని మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ గురించే మాట్లాడే ముందు రాహుల్ వందసార్లు ఆలోచించాలని సూచించారు. ఈ వ్యాఖ్యల వల్ల రాహుల్ గాంధీకి దళితులు, బీఎస్పీ పట్ల ఎలాంటి నీచమైన భావాలు ఉన్నాయో తెలుస్తున్నాయని అన్నారు. మాది పార్లమెంటులో బలవంతంగా ప్రధానమంత్రినికి కౌగిలించుకున్న రాహుల్ గాంధీ లాంటి పార్టీ కాదని, ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలైన పార్టీ కాదని మాయావతి విమర్శించారు.
ఈ సందర్భంగా మాయావతి బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని కేవలం ‘కాంగ్రెస్ ముక్త్’ కాకుండా ‘ప్రతిపక్ష ముక్త్’గా పని చేస్తుందని, ఇక్కడ చైనా రాజకీయ వ్యవస్థ మాదిరిగానే భారత్లో కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒకే ఆధిపత్య పార్టీతో మిగిలిపోయేలా చేస్తుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రతిపాదించామని, దీనిపై కనీసం మాటకూడా మాట్లాడలేదన్నారు.
సీబీఐ, ఈడీ, పెగాసస్కు భయపడ్డారన్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు సాధించగా.. 2.5శాతం ఓట్లు మాత్రమే రాగా.. 97శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కాపాడుకోలేకపోయారు. బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా.. దాదాపు 13శాతం వరకు ఓట్లు రాగా.. ఇందులో 72శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.