లక్నో: బీఎస్పీ నేత మాయావతి(Mayawati) క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున్న ఊహాగానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె దీనిపై ఓ పోస్టు చేశారు. తమ పార్టీపై కొందరు పొత్తు గురించి రూమర్లు చేస్తున్నారని, అంటే తమ ప్రమేయం లేకుండా ఎవరి గెలువరన్న విషయం స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానో పోటీ చేయనున్నట్లు మాయావతి తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
1. आगामी लोकसभा आमचुनाव बीएसपी द्वारा किसी भी पार्टी से गठबंधन नहीं करने की बार-बार स्पष्ट घोषणा के बावजूद आएदिन गठबंधन सम्बंधी अफवाह फैलाना यह साबित करता है कि बीएसपी के बिना कुछ पार्टियों की यहाँ सही से दाल गलने वाली नहीं है, जबकि बीएसपी को अपने लोगों का हित सर्वोपरि है।
— Mayawati (@Mayawati) February 19, 2024