Imtiaz Qureshi : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, మాస్టర్ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి (93) శుక్రవారం కన్నుమూశారు. ఐటీసీ హోటల్స్లో మాస్టర్ చెఫ్గా ఖురేషి పేరొందారు. దమ్ పుఖ్త్ సంప్రదాయ వంటకాలను పునరుద్ధరించినందుకు చెఫ్ ఖురేషి ప్రశంసలు అందుకున్నారు. 1931లో చెఫ్ల కుటుంబంలో పుట్టిన ఖురేషి వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
2015లో ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెఫ్ ఖురేషి మాట్లాడుతూ, బిర్యానీ లాంటిదేమీ లేదు.. ప్రతి వంటకం పులావ్. బిర్యానీ అని పిలవబడే ప్రతిదానిలో, ముడి లేదా వండిన మాంసానికి జోడించినప్పుడు బియ్యం మూడు వంతులు వండుతారు. కాబట్టి సాంకేతికంగా, అవన్నీ పులావ్లే అని చెప్పుకొచ్చారు.
తాను నిజాయితీగా పనిచేశానని, జీవితమంతా స్వార్ధం లేకుండా గడిపానని అన్నారు. ఖురేషి మరణవార్త తెలిసిన వెంటే సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కునాల్ కపూర్, రణ్వీర్ బ్రార్ వంటి సెలబ్రిటీ చెఫ్స్ ఖురేషి ఇక లేరన్న వార్త బాధించిందని పేర్కొన్నారు. ఖురేషి పాకశాస్త్ర ప్రావీణ్యం, ఈ రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కునాల్ కపూర్ పోస్ట్ చేశారు. సింగర్ అద్నాన్ సమీ కూడా ఖురేషి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
Read More :
farmers protest | నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మృతి