ఉత్తర్ప్రదేశ్లో ఘరానా మోసం బయటపడింది. సామూహిక వివాహాల పేరుతో కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అందజేసే పథకంలో భాగంగా సొమ్మును కాజేసేందుకు కేటుగాళ్లు నకిలీ పెండ్లిలు చేసేందుకు కుట్రకు తెరలేపారు. వరుడు లేకుండానే వందలాది మహిళలు ఎవరికి వారు మెడలో దండలు వేసుకొని పెండ్లి తంతును మమ అనిపించారు. ఇందుకు కారణమైన సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారులను గుర్తించారు. ఈ వీడియో వైరల్గా మారడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఇందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసుకోవాలంటే.. మనమూ ఓ లుక్కేద్దాం.