న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్పార్క్ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్ ఉప్హార్ సినిమా (Uphaar Cinema) హాల్లో ఆదివారం ఉదయం 4.45 గంటల తర్వాత మంటలు చెలరేగాయి. దీంతో టాకీస్లోని బాల్కని, కింది ఫ్లోర్లో ఉన్న సీట్లన్నీ కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరగలేదని చెప్పారు.
కాగా, రెండంతస్థులు ఉన్న ఉప్హార్ థియేటర్ 20 ఏండ్ల కిందటే మూతపడింది. 1997, జూన్ 13న టాకీస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 59 మంది మృతిచెందారు. ఆ సమయంలో థియేటర్లో బార్డర్ అనే హిందీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత టాకీస్ను ఇప్పటివరకు తెరవలేదు.