న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని చాందినీ చౌక్లో (Chandni Chowk) ఉన్న లజ్పత్రాయ్ మార్కెట్లో గురువారం ఉదయం 4.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తం విస్తరించాయి. భారీగా మంటలు ఎగసి పడటంతో 58 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు.