న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టోబర్తో ముగియనున్నది. దాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 16 వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది. మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.500 వరకు జరిమానా విధించడాన్ని కొనసాగిస్తామని హెచ్చరించింది.