Supreme Court | భార్యాభర్తల బంధం పరస్పర విశ్వాసంపై ఆధార పడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తనకు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
ఒక సాఫ్ట్ వేర్ జంట సుమారు 20 ఏండ్లుగా విడివిడిగా ఉంటున్నారు. గతంలో ఈ దంపతులకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఆదేశాలు సబబేనని పేర్కొంది.
‘వైవాహిక బంధం పరస్పరం విశ్వాసం, సహచర్యం, భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మితమై ఉంటుంది. ఈ కేసులో దంపతులు చాలా కాలంగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య కనిపిస్తున్న విరోధాల నేపథ్యంలో వారి వివాహ బంధాన్ని పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది’ అని వ్యాఖ్యానించింది.