ఆయుర్వేదం, అల్లోపతి చర్చ వెనుక వాణిజ్య ప్రయోజనాలను ఆశిస్తున్న లాబీ ఉన్నట్టు అనిపిస్తున్నది. కరోనా రోగులపై ఆయుర్వేదం, అల్లోపతి ఔషధాల ప్రభావంపై చర్చ జరుగాలి. ఇరు వర్గాలు తమ ఆధారాలను ముందు పెట్టాలి. అల్లోపతి ఫార్మా కంపెనీలు, డాక్టర్లు తమ ఆధిపత్యం పోతుందని భయపడుతున్నారు. అల్లోపతిలో దుష్ప్రభావాలు అతిపెద్ద లోపం. వాటిని తొలగించాలి. ఆయుర్వేదంలో దుష్ప్రభావాలు లేవు. ఎందుకంటే వాటిని మూలికలతో తయారుచేస్తారు. -వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జే