న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య పోటీ లాంఛనప్రాయ పోరు కాదని ఎన్నో అంశాలు చోటుచేసుకోవచ్చని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వా అన్నారు. ఎన్డీఏ అభ్యర్ధి జగ్ధీప్ ధన్కర్కు సంఖ్యాబలం అనుకూలంగా ఉన్నందున పోటీ లాంఛనప్రాయమేనన్న అభిప్రాయాన్ని ఆమె తోసిపుచ్చారు.
తాను 20 పార్టీల తరపున పోరాడుతున్నానని, పార్లమెంట్లో పరిస్ధితులు బాగా లేవని తాము మాట్లాడుతున్న క్రమంలో మార్పుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని ఓ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్గరెట్ అల్వా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితం ప్రకటిస్తారు.
బెంగాల్ మాజీ గవర్నర్ జగ్ధీప్ ధనకర్ను పాలక ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో నిలిపింది. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్ధీప్ ధనకర్కు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగ్దీప్ ధన్కర్కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించామని ఆమె బుధవారం ట్వీట్ చేశారు.