బీడ్ (మహారాష్ట్ర), డిసెంబర్ 23: ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిర్ణయించారు. ఈ డిమాండ్తో తాను వచ్చే నెల 20 నుంచి ముంబైలోని ఆజాద్ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని శనివారం ప్రకటించారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కోట్లాది మంది మరాఠాలు జనవరి 20న ఈ దీక్షకు తరలివస్తారని చెప్పారు. ఇదిలావుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విడుదల చేసిన వీడియో సందేశంలో, మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే నెల 24న విచారణ జరుపుతుందని, ఈ పరిణామాలు మరాఠాలకు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. తన ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, సంయమనం పాటించాలని కోరారు.