కోల్హాపూర్, సెప్టెంబర్ 5: విద్య, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత వారం జాల్నా జిల్లాలో ఆందోకారులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ కొల్హాపూర్ పట్టణంలో మరాఠా సంఘాలు మంగళవారం పిలుపునిచ్చిన బంద్కు మంచి స్పందన వచ్చింది. పట్టణంలోని దుకాణాలన్నీ దాదాపు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సర్వీసులు నిలిచిపోయాయి.
కొల్హాపూర్లోని దసరా చౌక్లో సకల్ మరాఠా సమాజ్ నేతృత్వంలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. మరాఠా రిజర్వేషన్లపై బీజేపీ-షిండే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బంద్కు అనూహ్య మద్దతు లభించిందని శివసేన(యూబీటీ) నేత సునీల్ పవార్ పేర్కొన్నారు. జాల్నా ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, దీంతో బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు.