దంతెవాడ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో తుపాకులు మరోసారి గర్జించాయి. గాడం-జంగంపాల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఓ మోస్టు వాంటెడ్ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు.
ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలం నుంచి ఓ 8ఎంఎం పిస్టల్, నాటు తుపాకీ, 2 కిలోల ఐఈడీతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్ రాజ్ తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం బీజాపూర్ జిల్లాలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. నైమిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బీజాపూర్ పట్టణానికి మింగాచల్ నది నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు నది ఒడ్డున వాటర్ ప్లాంట్ను నిర్మిస్తుండగా నక్సల్స్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి