భారత్లో బాగా పండే పంటల్లో తేయాకులు కూడా ఒకటి. భారత్లోని అసోం వంటి ప్రాంతాల్లోని తేయాకుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ నుంచి వచ్చే టీ ఎగుమతులను విదేశాలు వెనక్కి పంపేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ టీ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అన్షుమాన్ కనోరియా వెల్లడించారు.
భారత్ నుంచి వచ్చే టీ ఆకుల్లో అనుమతించిన దాని కన్నా ఎక్కువగా పురుగుల మందు పరిమితులకు మించి ఉంటోందని ఆయా దేశాలు చెప్తున్నట్లు కనోరియా తెలిపారు. ఈ క్రమంలోనే చాలా మంది స్వదేశీ బయ్యర్లు కూడా టీ పొడిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నట్లు ఆయన అన్నారు.
దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈయూ (యూరోపియన్ యూనియన్) ప్రమాణాలనే ఈ ఎగుమతుల విషయంలో ఉపయోగిస్తాయని చెప్పిన ఆయన.. ఈయూ ప్రమాణాలు మన దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల కన్నా చాలా కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు.