న్యూఢిల్లీ : కొందరు తాతలు, తండ్రులు వారసత్వంగా ఇచ్చిన సంపదను, ఆస్తులను చూసి మురిసిపోతుంటారు. పూర్వీకుల పట్ల ప్రేమను, వారి ఆప్యాయతకు కృతజ్ఞత కనబరిచేవారు మాత్రం అరుదు. ఓ వ్యక్తి కాలం వడిలో కనుమరుగైన తాతలకు టాటూలను డెడికేట్ చేసిన పోస్ట్ షేర్ చేయడంతో ఇంటర్నెట్లో అది వైరల్గా మారింది.
last year, within 9 months i lost my daadi and my naanu. today, i made permanent the ways i’d like to remember them.
my ajji with a strong cup of chaha and my ajoba- cheekily hiding imlis from his garden. pic.twitter.com/v42WedM8DT
— begum (formerly duchess) (@pettyparthy) February 8, 2023
ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెట్టీపార్ధీ అనే ట్విట్టర్ యూజర్ తన గ్రాండ్పేరెంట్స్ ఫొటోలతో పాటు వారికి డెడికేట్ చేసిన టాటూలనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత ఏడాది తొమ్మిది నెలల వ్యవధిలో తాను తన తాత, నాయనమ్మను కోల్పోయాను..ఈరోజు వారిని తాను ఎప్పటికీ గుర్తుంచుకునే మార్గం అన్వేషించాను.. టాటూస్తో వారి జ్ఞాపకాలను పదిలపరుచుకున్నానంటూ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పోస్ట్ ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 63,000కుపైగా వ్యూస్ను రాబట్టింది. ఆ వ్యక్తి అద్భుతమైన ఆలోచనకు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. తమ గ్రాండ్పేరెంట్స్తో తమకున్న అనుభవాలను పలువురు పంచుకున్నారు.