Punjab | పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి చెన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. ఈ మధ్యలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ కూడా ఎంటరయ్యారు. దీంతో మరింత కాకరేపుతోంది. పంజాబ్ సీఎంని పంజాబ్ ప్రజలే ఎన్నుకుంటారని పీసీసీ అధ్యక్షుడు సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను పంజాబ్ ప్రజలు ఎన్నుకుంటారు. అందులోంచి ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంటారు. అధిష్ఠానం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని మీతో ఎవరు చెప్పారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అయితే పంజాబ్ సీఎం మాత్రం తానే సీఎం అభ్యర్థిని అన్నట్లుగా తనకు తాను ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కంటే ముందే అధిష్ఠానం సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సీఎం చెన్నీ డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే సీఎం అభ్యర్థిని ప్రకటించడకుండానే పార్టీ ఎన్నికల గోదాలోకి దిగిందో, ఆ సమయాల్లో చిత్తుగా ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. 20`17 లో సీఎం అభ్యర్థిని ప్రకటించింది.. పార్టీ గెలిచింది అంటూ ఉదహరిస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ వెంటనే సీఎ అభ్యర్థిని ప్రకటించాలని సీఎం చెన్నీ సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సీనియర్ నేత మనీశ్ తివారీ కౌంటర్ ఇచ్చారు. పంజాబ్కు సీరియస్గా పనిచేసే వారు సీఎం కావాలని, రాజకీయాలు చేసేవారు, సోషల్ ఇంజినీరింగ్ చేసేవారు, వినోదభరితంగా ఉంటూ పాలన చేసేవారు, ఉచిత పథకాలు ఇచ్చేవారు సీఎంగా పనికిరారు. సీరియస్గా ఉంటూ పనిచేసే వారే పంజాబ్ ప్రజానీకానికి అవసరం అంటూ తివారీ ట్వీట్ చేశారు.