Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor case)లో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై విరుచుకుపడ్డారు. ‘సార్ నన్ను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు. కానీ, మీరు నా మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేరు. బ్రిటీష్ వారు సైతం స్వాతంత్య్ర సమరయోధులను ఇబ్బంది పెట్టారు. కానీ, వారి మనోభావాలను విచ్ఛిన్నం కాలేదు’ అంటూ మనీష్ సిసోడియా జైలు నుంచి సందేశం పంపారు. ఆయన ట్వీట్ ప్రధాని మోదీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సైతం మనీష్ సిసోడియా జైలులో ఉండగానే.. అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పోస్టవగా.. జైలులో ఉండగా.. ఎలా ట్వీట్ చేశారని, జైలులో మొబైల్ వాడుతున్నారా? అంటూ బీజేపీ ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఫిబ్రవరి 26న దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలు సమాధానాలు సంతృప్తికరంగా లేవని, విచారణకు సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత మనీష్ సిసోడియాతో పాటు సత్యేందర్ జైన్ సైతం ఈ నెల 1న తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తిహార్ జైలులో ఉన్నారు.
साहेब जेल में डालकर मुझे कष्ट पहुँचा सकते हो,
मगर मेरे हौसले नहीं तोड़ सकते,
कष्ट अंग्रेजो ने भी स्वतंत्रता सेनानियों को दिए,
मगर उनके हौसले नहीं टूटे।
– जेल से मनीष सिसोदिया का संदेश
— Manish Sisodia (@msisodia) March 11, 2023