ఇంఫాల్ : వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మణిపూర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యాంతోంగ్ హుకిప్ సోమవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీలోకి ఆహ్వానించి, సభ్యత్వం అందించారు. అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ దేశంలో శాంతి, సుస్థిరత కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల చేరిక మణిపూర్, మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తుందని సంబిత్ పాత్రా పేర్కొన్నారు. బీజేపీ, ప్రధాని విధానాలను మెచ్చి నేతలిద్దరూ బీజేపీలో చేరారన్నారు. ఇదిలా ఉండగా 2017లో తొలిసారిగా బీజేపీ మణిపూర్లో అధికారంలోకి వచ్చింది.