న్యూఢిల్లీ : సమాజంలో మంచి పనులు చేయడానికి ఎలాంటి హోదా అవసరం లేదని మంచి మనసుంటే చాలని ఈ వ్యక్తి నిరూపించాడు. ఒడిషాలోని బెహ్రంపూర్కు చెందిన నాగేషు పాత్రో పగలు కూలీ పనులు చేస్తూ రాత్రి సమయంలో నిరుపేద పిల్లలకు పాఠాలు చెబుతూ టీచర్ పాత్ర పోషిస్తున్నాడు. ట్విట్టర్లో ఏఎన్ఐ ఈ వివరాలు పోస్ట్ చేయగా నాగేషు పాత్రోకు నెటిజన్లు శాల్యూట్ చేస్తున్నారు.
Odisha | A railway porter by night, Berhampur's Ch Nageshu Patro becomes a teacher for young and poor children during the day. The 31-year-old also teaches at a private college as a guest lecturer. pic.twitter.com/yZdBetJx5p
— ANI (@ANI) January 8, 2023
పాత్రో ప్రతిరోజూ రైల్వే స్టేషన్లో పోర్టర్గా పనిచేస్తూనే రాత్రి వేళ నిరుపేద చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేనా పాత్రో (31) ఓ ప్రైవేట్ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్గానూ వ్యవహరిస్తున్నారు. దాదాపు 12 ఏండ్ల నుంచి తాను ఇక్కడ పనిచేస్తున్నానని, పోర్టర్గా పనిచేస్తూనే పిల్లలకు చదువు చెబుతున్నానని పాత్రో చెప్పుకొచ్చారు.
2006లో తన చదువు ఆగిపోగా 2012లో తిరిగి చదువు పూర్తిచేశానని, పోర్టర్గా పనిచేస్తూనే ఎంఏ పూర్తిచేశానని తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా 81,000 మందికి పైగా వీక్షించారు. పేద పిల్లలకు సాయం చేస్తున్న పాత్రో పెద్దమనసును నెటిజన్లు ప్రశంసించారు. సమాజంలో ఇంకా పాత్రో వంటి దయార్ధ్ర హృదయులు ఉన్నారని ఈ పోస్ట్ గుర్తుచేసిందని పేర్కొన్నారు.