భోపాల్: మధ్యప్రదేశ్లోని సిధ్ జిల్లాలో బ్రజేశ్ ప్రజాపతి అనే వ్యక్తి ఏడుగురు గిరిజన బాలికలపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడ్డాడన్న విషయం ఆలస్యంగా బయటపడింది.
వాయిస్ చేంజింగ్ యాప్ను ఉపయోగించి ఓ మహిళా టీచర్ మాట్లాడుతున్నట్టు ఫోన్ ద్వారా అతడు బాలికలను మోసం చేసేవాడని, స్కాలర్షిప్స్ గురించి మాట్లాడేందుకు నిర్మానుష్య ప్రాంతాలకు ఆ బాలికల్ని రప్పించి లైంగికదాడికి పాల్పడేవాడని సిధ్ జిల్లా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.