చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 753 కోట్లు జమయ్యాయి. నగరానికి చెందిన మహ్మద్ ఇద్రిస్ తన కొటాక్ మహింద్ర బ్యాంక్ నుంచి శుక్రవారం తన స్నేహితుడికి రూ. 2000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ లావాదేవీ అనంతరం ఇద్రిస్ తన బ్యాంక్ బ్యాలెన్స్ను చెక్ చేసుకుంటే తన ఖాతాలో రూ. 753 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్టు మెసేజ్ చూపడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు.
ఈ అసాధారణ ఘటనతో విషయాన్ని ఇద్రిస్ తన బ్యాంక్కు సమాచారం అందించాడు. దీంతో ఇద్రిస్ ఖాతాను బ్యాంక్ ఫ్రీజ్ చేసింది. తమిళనాడులో ఈ తరహా ఘటన ఇది మూడోసారి కావడం విశేషం. గతంలో చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్కుమార్ తన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాలో రూ. 9000 కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించాడు.
బ్యాంక్ దృష్టికి అతడు ఈ విషయం తీసుకెళ్లగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పరిస్థితిని చక్కదిద్ది, అదనపు మొత్తాన్ని విత్డ్రా చేసింది. ఇక తంజావూర్కు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ. 756 కోట్ల బ్యాలెన్స్ చూపడంతో కంగుతిన్నాడు.
Read More :