అహ్మదాబాద్: దీపావళి రోజున పటాకులు (Firecrackers) కాల్చడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తండ్రీకుమారులను కత్తితో పొడిచి చంపారు. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి పది గంటలకు రామోల్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీ వద్ద పటాకులు పేలుస్తున్న కొంతమంది వ్యక్తులతో నలుగురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఇది గొవడకు దారి తీయడంతో నలుగురు వ్యక్తులు ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనలో 44 ఏళ్ల ఆటో డ్రైవర్ విజయ్ శంకర్ బన్షీలాల్, అతడి కుమారుడు ధీరేంద్ర సింగ్ మరణించారు. బన్షీలాల్ మేనల్లుడైన 17 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన దీపక్ మరాఠీని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారిలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల కిందట ఆటో డ్రైవర్ బంధువు, నిందితుల మధ్య గొడవ జరిగినట్లు వెల్లడించారు.