లక్నో: అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. (man swept away by crocodile) ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నోయిడాలో నివసించే దీపక్ శర్మ అత్త ఊర్మిళా దేవి చనిపోయింది. ఈ నేపథ్యంలో అతడు తన భార్యతో కలిసి ఉమ్రి గ్రామానికి చేరుకున్నాడు.
కాగా, బుధవారం సరయూ నది ఒడ్డున ఊర్మిళా దేవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏర్పాట్లలో సహాయం చేసిన దీపక్ శర్మ, ఆ తర్వాత స్నానం కోసం సరయూ నదిలోకి దిగాడు. ఆ నదిలో మొసళ్లు ఉంటాయని కొందరు హెచ్చరించినప్పటికి అతడు పట్టించుకోలేదు. ఇంతలో ఒక మొసలి దీపక్ను నోటకరుచుకుని నీటిలోకి లాక్కుపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. దీపక్ కోసం స్థానికులతో కలిసి పడవలో ఆ నదిలో గాలించారు. ఫలితం లేకపోవడంతో లక్నో నుంచి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాన్ని పిలిపించారు. దీపక్ మృతదేహం లభించకపోవడంతో అతడి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్నది.
#Tragic Crocodile Attack in Gonda, #UttarPradesh
In a heartbreaking incident, 30-year-old Deepak from Greater Noida was dragged into the Saryu River by crocodiles while bathing after his mother-in-law’s cremation in Umri Begamganj area on May 20, 2026. Locals witnessed the… pic.twitter.com/yMUQJojfc2
— Thepagetoday (@thepagetody) May 21, 2026