Gold Jewelry Robbed | తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ బంగారం షోరూమ్ (Jewellery Showroom)లో భారీ చోరీ జరిగింది (Gold Jewellery Robbed). ఒక్కడే షాపంతా కలియతిరిగి కిలోల కొద్దీ బంగారాన్ని లూటీ చేశాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు షోరూమ్లోని సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి.
కోయంబత్తూర్ (Coimbatore)లోని గాంధీపురం ప్రాంతంలో ఉన్న జోస్ అలూక్కాస్ (Jos Alukkas)లో ఈ దొంగతనం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దుకాణంలోకి చొరబడ్డాడు. ఆ తర్వాత షోరూమ్ మొత్తం కలియతిరిగాడు. నచ్చిన బంగారాన్ని తన వెంట తెచ్చుకున్న సంచిలోకి నింపుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గంలోనే ఎంచక్కా బయటకు వెళ్లిపోయాడు.
ఉదయం షోరూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. షో రూమ్ నుంచి సుమారు 25 కేజీల బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. దొంగతనానికి పాల్పడింది ఒక్కడే అని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ దొంగ కోసం గాలింపు చేపడుతున్నారు.
Approximately 150-200 sovereigns of gold jewellery robbed at Jos Alukkas showroom in Coimbatore in the early hours today. The police have formed five special teams to nab the accused. As per CCTV visuals, only one person is seen inside the store during the scene. @IndianExpress pic.twitter.com/nVyvKjpidp
— Janardhan Koushik (@koushiktweets) November 28, 2023
Also Read..
Feroz Khan | ఓటరుకు రూ.లక్ష.. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్పై కేసు నమోదు
Charlie Munger | వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగేర్ కన్నుమూత