లక్నో: ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో పొడిచి భార్యను చంపాడు. (Man stabs wife to death) ఇది చూసిన పిల్లలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే తల్లిని హత్య చేసిన తండ్రిని గదిలో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే తప్పించుకునేందుకు అతడు అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆదిత్య కపూర్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన ఆదిత్య కత్తితో పొడిచి భార్యను చంపాడు. ఇది చూసిన పిల్లలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే తండ్రిని గదిలో బంధించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆదిత్య తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ పైనుంచి దూకి గాయపడిన ఆదిత్యను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్యను హత్య చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆదిత్య తరచుగా భార్యతో గొడవ పడేవాడని, గతంలో పలుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు.