భోపాల్: మధ్యప్రదేశ్లోని కట్ని పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెడుతూనే ప్రాణాలు కోల్పోయాడు. దేవుడి విగ్రహం ముందు కూర్చుని తలను దిమ్మెకు ఆన్చి దండం పెట్టాడు. అయితే 15 నిమిషాలు అయినా అతను అలాగే ఉండి పైకి లేవలేదు.
దాంతో అనుమానం వచ్చిన తోటి భక్తులు పూజారికి సమాచారం ఇచ్చారు. పూజారి వచ్చి అతడిని కదిలించి చూడగా కుప్పకూలాడు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ వల్లే అతను ఎలాంటి కదలిక లేకుండా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు.