తిరువనంతపురం : నైట్ డ్యూటీలో ఉన్న పోలీసుల కోసం ఓ వ్యక్తి కైలాష్ ఖేర్ ఆలపించిన తేరీ దీవానీ సాంగ్ను పాడిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. కోజికోడ్లో చిత్రీకరించిన ఈ వీడియోను కేరళ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 43 సెకండ్ల నిడివి కలిగిన ఈ క్లిప్లో కోజికోడ్లో నైట్ షిఫ్ట్లో ఉన్న పోలీసుల కోసం కన్హనియన్ సుదేవ్ అనే వ్యక్తి తేరీ దీవానీ సాంగ్ను లయబద్ధంగా పాడటం కనిపిస్తుంది.
ഇന്നലെ കോഴിക്കോട് പട്ടണത്തിൽ നൈറ്റ് ഡ്യൂട്ടിയിൽ ഉണ്ടായിരുന്ന സഹപ്രവർത്തകർക്ക് കുഞ്ഞനിയൻ സുദേവ് നൽകിയ പാട്ടിൻ്റെ വിരുന്ന്❤️#keralapolice pic.twitter.com/N6wuZbmeiX
— Kerala Police (@TheKeralaPolice) February 11, 2023
అతడి గొంతులో ఈ పాట శ్రావ్యంగా పలికిన తీరుకు పోలీసులు ముగ్ధులయ్యారు. కన్హనియన్ సుదేవ్ తాను కేరళకు చెందిన వయలనిస్ట్, వోకలిస్ట్గా బయోలో పేర్కొన్నాడు. కోజికోడ్ పట్టణంలో నిన్న నైట్డ్యూటీలో ఉన్న వారికి కన్హనియన్ సుదేవ్ సాంగ్ వీనుల విందని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 7000కుపైగా వ్యూస్ లభించాయి.
కాగా తన వీడియోను షేర్ చేసినందుకు సుదేవ్ కే కేరళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తేరీ దీవానీ 2007లో విడుదలైంది. సుదేవ్ ఈ సాంగ్ను హృద్యంగా ఆలపించారని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీ గొంతు అద్భుతంగా ఉంది, ఇలాగే మధురమైన పాటలు పాడుతూ అలరించండని ఓ యూజర్ రాసుకొచ్చారు.