పాల్కాడ్: సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలిక(minor girl)తో ఫ్రెండ్షిప్ చేసుకుని, ఆ అమ్మాయిపై లైంగిక దాడుల(sexual assault)కు పాల్పడిన వ్యక్తికి కేరళ కోర్టు(kerala court) 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. పట్టాంబి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి సతీశ్ కుమార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు. పోక్సో (Pocso)చట్టం ప్రకారం శిక్షను ఖరారు చేశారు. బాధితురాలికి 1.5 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిషా విజయ్కుమార్ తెలిపారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడిన కేసులోనూ ఆ వ్యక్తిపై ఐపీసీ ప్రకారం మరో రెండేళ్ల శిక్షను వేసింది.
కొల్లామ్కు చెందిన ఆ వ్యక్తి.. 2021లో సోషల్మీడియా ద్వారా ఓ మైనర్తో స్నేహం చేశాడు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు అక్కడకు వెళ్లేవాడు. అనేక సార్లు ఇంటికి వెళ్లిను అతను.. ఆ మైనర్ను లైంగికంగా వేధించినట్లు ప్రాసిక్యూటర్(prosecutor) వాదించారు. అయితే జరిగిన ఘటన గురించి పేరెంట్స్కు చెప్పిన తర్వాత వాళ్లు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దర్యాప్తు సమయంలో 21 మందిని విచారించినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు.