న్యూఢిల్లీ: నడి వయసులో ఉన్న ఒక వ్యక్తి వితంతువైన వయసు తక్కువ ఉన్న కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. 45 ఏళ్ల వ్యక్తి కుమారుడు మరణించాడు. దీంతో వితంతువైన కుమారుడి భార్య, ఆ వ్యక్తి కలిసి జీవించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల అందమైన ఆ మహిళను, మామ అయిన అతడు ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య వయసులో 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో రిపోర్టర్లు వారిద్దరినీ ఈ పెళ్లి గురించి నిలదీశాడు. అయితే తమ ఇష్టం మేరకు వివాహం చేసుకున్నట్లు వారిద్దరూ స్పష్టం చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా స్పందించారు. ఈ పెళ్లిని చాలా మంది సమర్థించారు. వయసులో తేడా ఉన్నప్పటికీ మేజర్లు అయిన వారిద్దరూ పెళ్లి చేసుకోవడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. వారిద్దరూ ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ రిపోర్టర్లకు వచ్చిన ఇబ్బంది ఏంటని కొందరు ప్రశ్నించారు. వారికి ఇబ్బంది కలిగించిన ఆ రిపోర్టర్లకు బుద్ధి చెప్పాలని, వారిపై కేసు నమోదు చేయాలని మరి కొందరు డిమాండ్ చేశారు.