ముంబై: ఒక వ్యక్తి ఫోన్లో బిగ్గరగా మాట్లాడటంపై అతడి కొడుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన తండ్రి ఐరాన్ రాడ్తో కొడుకును కొట్టడంతో అతడు మరణించాడు. (Man Kills Son) ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం పిప్రా గ్రామానికి చెందిన రామారావు కక్డే మొబైల్ ఫోన్లో బిగ్గరగా మాట్లాడాడు. 28 ఏళ్ల కుమారుడు సూరజ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కాగా, ఆగ్రహించిన రామారావు ఇనుప రాడ్తో కొడుకు సూరజ్ను కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రామారావును అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రీకుమారులు మద్యం తాగి ఉన్నారని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.