భోపాల్: నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి.. శవంపై తన కోరిక తీర్చుకున్న ఘటన మధ్యప్రదేశ్లోని గుణాలో జరిగింది.
గుణా జిల్లాలోని జైతా దొంగర్కు చెందిన 40 ఏండ్ల వికలాంగుడికి ఓ కూతురు ఉన్నది. 14 ఏండ్ల వయస్సున్న ఆమెపై ఆ తండ్రి కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. సమయం చూసి ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో ఇంట్లో చెప్తానని ఆమె హెచ్చరించింది. దీంతో అక్కడే ఆ మైనర్ బాలికను చంపేసి ఇంటికి వెళ్లాడు.
అయితే ఏమీ తెలియనట్లు మంగళవారం సాయంత్రం తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తన తండ్రితో ఆమె కనింపించిందని బాధితురాలి ఇంటి పక్కనవారు పోలీసులకు చెప్పారు.
దీంతో తమ స్టయిల్లో అతడిని పోలీసులు ప్రశ్నించగా.. తానే చంపానని ఒప్పుకున్నాడు. ఆమె శవంపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆధారాలను సేకరించారు.