కోల్కతా : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రవపదార్ధాలు తీసుకుంటూ డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి తన ఇంటి టెర్రేస్లో పెనంపై ఆమ్లెట్ వేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోలో వ్యక్తి టెర్రేస్పై పెనం మీద కోడిగుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేస్తుండటం కనిపిస్తుంది. ఎండ వేడికి గుడ్డు ఉడికి ఆమ్లెట్గా మారడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. ఆపై ఫ్రైడ్ ఎగ్ను ఆ వ్యక్తి టేస్ట్ చేయడం చూడొచ్చు. ఈ వీడియోకు 15 లక్షల పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. దీన్ని నమ్మలేకపోతున్నామని ఓ యూజర్ కామెంట్ చేయగా, అమేజింగ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.