లక్నో: అప్పు తీర్చడం కోసం ఒక వ్యక్తి తన కొడుకును అమ్మకానికి పెట్టాడు. కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్న అతడు ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు. నేను అతడ్ని అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న బోర్డును మెడలో వేసుకున్నాడు. (My son is for sale) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్ బస్టాండ్కు సమీపంలో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి రోడ్డు పక్కన దీనంగా కూర్చొన్నాడు. అతడి మెడలో ఒక బోర్డు ఉంది. ‘నా కొడుకు అమ్మకానికి ఉన్నాడు. కుమారుడ్ని నేను అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉంది.
కాగా, ఆ వ్యక్తి తన బంధువు నుంచి రూ.50,000 అప్పు చేశాడు. అది తీర్చకపోవడంతో బంధువుతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్నాడు. తన కుమారుడ్ని బలవంతంగా అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అన్ని అప్పులు తీర్చేందుకు ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు కుమారుడ్ని అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ బంధువుతో మాట్లాడి ఆ వ్యక్తి సమస్యను పరిష్కరించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు యూపీలో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సీఎం యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘అలీగఢ్కు చెందిన నిస్సహాయుడైన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకుంటానంటూ మెడలో బోర్డు పెట్టుకుని రోధించాడు. ఇదే బీజేపీ అమృత కాలం. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్టను దిగజార్చకముందే ఎవరైనా ప్రభుత్వాన్ని మేల్కొల్పండి’ అని ఎక్స్లో విమర్శించారు.
ये है भाजपा का अमृतकाल जब एक पिता अपने पुत्र को बेचने के लिए गले में तख़्ती लटकाकर बिलखने को मजबूर है।
इससे पहले कि ये तस्वीर दुनिया भर में फैल जाए और प्रदेश के साथ-साथ देश की छवि संपूर्ण विश्व में धूमिल करे, कोई तो सरकार को जगाए। pic.twitter.com/hZsKY3Hwa7
— Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023