న్యూయార్క్ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్జీపీటీ (ChatGPT) వాడకంపై శిక్షణ ఇస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మూడు నెలల్లోనే ఏకంగా రూ. 28 లక్షల విలువైన భారత కరెన్సీని ఆర్జించాడు. డిసెంబర్ 2022లో ఓ ఎడ్యుకేషన్ ప్లాట్ఫాం వేదికగా ఆయన ఆన్లైన్ కోర్సును లాంఛ్ చేశాడు. 20 నుంచి 50 ఏండ్ల వయసు వారు ఈ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యారు.
చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలనే దానిపై తాను ఈ కోర్సు లాంఛ్ చేశానని ల్యాన్స్ జంక్ వెల్లడించారు. మూడు నెలల్లో జంక్ చేపట్టిన చాట్జీపీటీ మాస్టర్క్లాస్ : ఏ కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్ అనే కోర్సుకు విద్యార్ధుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15,000కు ఎగబాకింది. జంక్ తన సేల్స్ డ్యాష్బోర్డ్ స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. 2022 నవంబర్ నుంచి చాట్జీపీటీని ఉపయోగించుకోవడం జంక్ మొదలుపెట్టాడు.
ఇందులో ఉన్న అద్భుత జనరేటివ్ సామర్ధ్యాలకు ముగ్ధుడైన జంక్ ఈ కూల్ ఏఐ టూల్ను యూజర్లు సమర్ధవంతంగా వాడుకునేలా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. చాట్జీపీటీ అంటే ప్రజల్లో ఓ భయం ఉందని, దాన్ని తాను ఎగ్జైటింగ్గా, అప్రోచబుల్గా మలిచేందుకు తాను ప్రయత్నించానని అన్నారు. ఈ ఆన్లైన్ కోర్స్లో చాట్జీపీటీ బేసిక్స్తో పాటు బిజినెస్లు, విద్యార్ధులు, ప్రోగ్రామర్లకు అవసరమైన చాట్జీపీటీ నిర్ధిష్ట అప్లికేషన్స్పై లెసన్స్ ఉంటాయి.
Read More