న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
కాగా, సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి ఈ సందర్భంగా కలకలం సృష్టించాడు. ఉన్నట్టుండి ఆ వేదిక వద్దకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్కు ఏదో చెప్పేందుకు ఆ వ్యక్తి సైగలు చేశాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటకు తరలించారు.
మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ వంటి ఆప్ ముఖ్య నేతలు ఆ వేదికపై ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली के पूर्व सीएम अरविंद केजरीवाल की सुरक्षा में चूक का मामला भी सामने आया है… बताया जा रहा है कि छत्रसाल स्टेडियम में सभा को संबोधित करते वक्त मंच पर एक शख्स ने चढ़ने की कोशिश की… दरअसल अरविंद केजरीवाल जनता की अदालत कार्यक्रम को संबोधित कर रहे थे… इसी दौरान ये वाकया… pic.twitter.com/O9z1ptpEUU
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) October 6, 2024