రాంచీ: ఒక వ్యక్తి బైక్లో ఉన్న బాంబుతో కూరగాయల మార్కెట్కు వెళ్లాడు. ఆ బాంబు పేలడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన బైక్పై స్థానిక కూరగాయల మార్కెట్కు వెళ్లాడు. అయితే బైక్కు అమర్చిన లగేజ్ బాక్స్లో బాంబు ఉంది. ఒత్తిడి వల్ల ఆ బాంబు పేలింది. దీంతో మార్కెట్లో కూరగాయలు అమ్మే ముగ్గురు వ్యాపారులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే నగరంలోని షహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు పేలిన నేపథ్యంలో ఆ మార్కెట్ను మూసి వేశారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాంబు పేలుడు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.