న్యూఢిల్లీ : తల్లితండ్రులు పిల్లల కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడరు..అలాగే పేరెంట్స్ ముఖంలో నవ్వులు పూయించడం కన్నా ఎక్కవ మరొకటి ఉండదని పిల్లలు భావిస్తుంటారు. జీవితంలో తొలిసారి విమానంలో అడుగుపెట్టిన తండ్రి రియాక్షన్ను కొడుకు రికార్డు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
తండ్రీ కొడుకులు ఢిల్లీ నుంచి విమానంలో ముంబై చేరుకున్నారు. ఈ వీడియోను జతిన్ లంబా ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో తండ్రీ కొడుకులు ఎయిర్పోర్ట్కు మెట్రోలో చేరుకోవడం కనిపిస్తుంది. తండ్రి తొలిసారిగా విమానం ఎక్కిన క్రమంలో కొడుకుతో కలిసి సంతోషంగా సెల్ఫీలు తీసుకోవడం ఈ వైరల్ క్లిప్లో చూడొచ్చు.
కుమారుడిగా మీరు గర్వంగా ఫీలవుతారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన ఎంతోమంది ఇన్స్టాగ్రాం యూజర్లు భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి కలను సాకారం చేసిన కొడుకుపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియో ఎందుకో తనను ఉద్వేగానికి గురిచేసిందని ఓ యూజర్ రాసుకొచ్చారు. నా తల్లితండ్రుల కోసం ఏం చేయదలుచుకున్నానో మీరు చేసి చూపించారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More