న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) అంతా విస్తుపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లోకి వెళ్లిన దుండగుడు ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్లెట్ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్ఫూర్లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో తరగతి గదిలోకి ప్రవేశించిన యువకుడు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారి ముందే మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయం గురించి బాధితులు స్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్కు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని విద్యార్థులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
దీనిపై పోలీసులు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు (ఈఎంసీడీ) నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామనిన్నారు.