భోపాల్: మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. (Extra Charge On Beer) దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చెట్టు ఎక్కాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రిజ్మోహన్ శివహరే అనే వ్యక్తి మద్యం ప్రియుడు. అయితే క్వార్టర్ మద్యం బాటిల్పై రూ.20, బీరు బాటిల్పై రూ.30 అదనంగా లిక్కర్ షాపులు వసూలు చేయడంపై అతడు కలత చెందాడు. దీంతో ఫిబ్రవరిలో సీఎం హెల్ప్లైన్తోపాటు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, పోలీసులకు దీని గురించి ఫిర్యాదు చేశాడు.
కాగా, మద్యంపై అధికంగా వసూలు చేయడం గురించి తన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో శివహరే విసుగు చెందాడు. దీంతో ఈ నెల 19న స్థానికంగా ఉన్న చెట్టు ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అతడికి నచ్చజెప్పి చెట్టు నుంచి కిందకు దించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివహరే, మద్యంపై అధికంగా వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. లిక్కర్ షాపు యజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించాడు. తాను రెండు నెలలుగా పనికి వెళ్లలేదని, దీంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేదని తెలిపాడు. మద్యం అధిక ధరల గురించి ఫిర్యాదు చేసి అలసిపోయినట్లు చెప్పాడు. ఫిర్యాదు చేసినందుకు లిక్కర్ షాపు ఓనర్లు తనను కొట్టారని వాపోయాడు. అలాగే రామమందిరం ప్రారంభోత్సవం, రిపబ్లిక్ డే వంటి రోజుల్లో కూడా దొంగచాటుగా మద్యం అమ్మారని ఆరోపించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MP | Offbeat | Suicide for Liquor |
चाहें टैक्स बढ़े, या रेट, कभी शिकायत ना करने वाली कौम सबसे शांतिप्रिय कौम (दारू पीने वालों की) भी आज प्रदर्शनरत हैं।
राजगढ़ ज़िले के बृजमोहन शिवहरे ने MP मानव अधिकार आयोग को ₹100 के क्वार्टर पर ₹20 एक्स्ट्रा और बियर पर ₹30 एक्स्ट्रा वसूलने… pic.twitter.com/FL3YK9pTGl
— काश/if Kakvi (@KashifKakvi) March 18, 2024