బీహార్వాసిని అదుపులోకి తీసుకొన్న ఎన్ఐఏ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లో సంచలనం సృష్టించిన కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. బీహార్కు చెందిన ఈ అనుమానితుడు సంతోష్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
కన్నయ్యలాల్ను హత్య చేసిన నిందితులను విచారించడంతోవారు ఈ వ్యక్తితో కొన్నాళ్లు సంబంధాలు కొనసాగించినట్టు ఆధారాలు లభించాయి. హత్యకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతోపాటు హత్యలో ఈ అనుమానితుడి పాత్ర ఏమైనా ఉన్నదా? అనే కోణంలో ఎన్ఐఏ విచారిస్తున్నది.