లక్నో: ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) హాపూర్లో (Hapur) ఓ వ్యక్తి గుడిలో నమాజ్ (Namaaz) చేశాడు. దీంతో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వేకువజామున హాపూర్లోని ఛండీ ఆలయంలో (Chandi temple) అమ్మవారికి తొలి పూజ జరుగుతున్నది. భక్తులతోపాటు ఓ వ్యక్తి కూడా గుడిలోకి వచ్చాడు. అంతా హారతి (Aarti) కోసం వేచిఉన్నారు. అదేసమయంలో ఆలయ ఆవరణలో తనతో తెచ్చుకున్న వస్త్రాన్ని నేలపై పరిచి.. నమాజ్ చేస్తున్నాడు. దీంతో అతనిని భక్తులు అడ్డుకున్నారు. పూజారులు, ఆలయ అధికారులు అతడిని గుడిలోనుంచి బయటకు పంపించివేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా (SP Abhishek Verma) చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని అన్వర్గా (Anwar) గుర్తించామన్నారు. నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు. కాగా, పట్టణంలోని ఆలయాల్లో భద్రత పెంచాలని హాపూర్ ఎమ్మెల్యే విజయ్పాల్ అధతి (MLA Vijaypal Aadhati) అధికారులను కోరారు. ఇక నమాజ్ చేయడంతో ఆలయాన్ని గంగా జలంతో (Gangajal) రెండు సార్లు శుద్ధి చేశారు.