లక్నో: రైలులో మహిళా పోలీస్పై దాడి చేసిన వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ( Man Killed In Encounte) ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 30న అయోధ్య సమీపంలో సరయూ ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ రక్తపు మడుగుల్లో కనిపించింది. ఆమె ముఖం, తలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
కాగా, మహిళా పోలీస్ కానిస్టేబుల్ సోదరుడు అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలహాబాద్ హైకోర్టు కూడా ఈ సంఘటనపై స్పందించింది. యూపీ ప్రభుత్వంతోపాటు రైల్వే పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అయోధ్య పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. తనపై దాడి చేసిన వ్యక్తి అనీస్ ఖాన్గా ఫొటో చూసి బాధిత మహిళా కానిస్టేబుల్ గుర్తించింది.
మరోవైపు ప్రధాన నిందితుడు అనీస్ ఖాన్ కోసం పోలీసులు వెతికారు. అతడు ఒక చోట ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య పోలీసులు, ప్రత్యేక టాస్క్ఫోర్స్ సంయుక్తంగా రైడ్ చేశారు. లొంగిపోవాలని నిందితుడ్ని హెచ్చరించారు. అతడు కాల్పులు జరుపడంతో పోలీసులు కూడా ప్రతిగా కాల్పులు జరిపారు.
కాగా, ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన అనీస్ ఖాన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్టు లా అండ్ ఆర్డర్ ప్రత్యేక డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన అతడి సహాయకులు ఆజాద్, విషంభర్ దయాల్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ కూడా గాయపడినట్లు వెల్లడించారు.
#UttarPradesh: Main accused in case of attack on lady police constable killed in police encounter in Saryu Express near Ayodhya. pic.twitter.com/Gd4fqpWv9s
— All India Radio News (@airnewsalerts) September 22, 2023