కోల్కతా: పశ్చిమబెంగాల్పై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ తాను 29 నుంచి రెండు రోజులపాటు ధర్నా చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు. ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం, గృహాలు, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కేంద్ర బడ్జెట్లోనూ మా రాష్ర్టానికేమీ ఇవ్వలేదు. కేంద్రం నుంచి నిధులు రాని రాష్ట్రం మాదొక్కటే’ అని మమత మండిపడ్డారు. ఈ నెల 23న ఆమె ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తో సమావేశం కానున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.