న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలోని అన్నింటినీ కాషాయీకరణ చేస్తున్నారని, దాంట్లో భాగంగానే భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ జెర్సీల రంగును నీలం నుంచి కాషాయ రంగులోకి మార్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ సర్కార్పై మండిపడ్డారు. శుక్రవారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ‘నేడు ప్రతీది కాషాయికరణ జరుగుతున్నది.
భారత క్రికెట్ను సైతం వదల్లేదు. క్రీడాకారుల ప్రాక్టీస్ జెర్సీల రంగు నీలం నుంచి కాషాయంలోకి మార్చారు. మెట్రో స్టేషన్లకు కాషాయాన్ని పులుముతున్నారు. మోదీ సర్కార్ వచ్చాక దేశంలో ఇది సర్వసాధారణమైంది’ అని అన్నారు.