Mamata Banerjee | రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను విధించడానికి తమ ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆంక్షల విధింపు కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చేవారి దగ్గరే ఈ ఒమిక్రాన్ కేసులు బయట పడుతున్నాయని, ముఖ్యంగా యూకే నుంచి వచ్చిన వారి దగ్గరే కేసులు బయటపడుతున్నాయని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాలని, దీని ద్వారా ఒమిక్రాన్ కేసులు కాస్తలో కాస్త తగ్గే ఛాన్స్ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గంగాసాగర్ మేలా సందర్భంగా తమ ప్రభుత్వం ఎలాంటి కోవిడ్ ఆంక్షలను విధించడం లేదని, కుంభమేళా జరిగే సమయంలో ఏవైనా ఆంక్షలు విధించారా? అంటూ సీఎం మమత సూటిగా ప్రశ్నించారు.