కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సోదరుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోదరుడి భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారని అన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. రేపటి నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని తన సోదరుడితో చెప్పానన్నారు. బెంగాల్లో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో సీఎం మమత గురువారం వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదరుడి తీరుపై ఆమె బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్తో సహా ముఖ్యమైన ప్రభుత్వ అధికారులంతా కరోనా బారిన పడ్డారని తెలిపారు. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని చెప్పారు. మీతోపాటు మీ పొరుగు వారి క్షేమం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
కరోనా నిబంధనలపై కఠినంగా వ్యవహారించాలని పోలీస్ అధికారులను సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కేసులు మరింతగా పెరిగితే కఠిన ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. తన కారు డ్రైవర్లు ఇద్దరికి కరోనా సోకడంతో శుక్రవారం సచివాలయానికి రావడం లేదన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించే చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్స్టిట్యూట్ రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవానికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతానని తెలిపారు.